కవిత్వం సాదా సీదాగా వుండకూడదు.కవిత్వంలో టెక్నిక్ వుండాలంటారు ఆరుద్ర. రమాదేవి రాసిన
ఈ కవిత కూడా ఇంచుమించు ఆరుద్ర చెప్పిన…టెక్నిక్ ఛాయలున్నాయి.రమాదేవి రొటీన్ కు కొంచెం
ఎడంగా జరిగి రాసిన ఈ ప్రేమ కవితను ఈరోజు కాఫీ టైమ్లో చూద్దాం.!
“అతడు బొమ్మ గీయడం మొదలెడతాడు
నేను ఆసక్తిగా చూస్తూ ఉంటాను...
ఇది కొన్ని వేలయేళ్లుగా జరుగుతున్నట్టుగా ఉంది
ఇందులో ముక్కు బాగాలేదంటూ
అందులో కన్ను బాగలేదంటూ
తొమ్మిదినీ పక్కకు పెట్టి
పదో బొమ్మతో పూర్తయిందంటాడు
పూర్తయిన బొమ్మను
ఎవరికో ఇచ్చి డబ్బు పుచ్చుకుంటాడు
అందుకే కాబోలు
అందంగా పూర్తయిన బొమ్మ మీద
నాకు ఎప్పుడూ ఆశక్తి లేదు..
నా కన్నులు ఎప్పుడూ
అతను వదిలేసిన బొమ్మల పైనే...
ఇంతకూ
వదిలేసిన బొమ్మ పూర్తయినట్టా
బాగుందంటూ వదులుకున్న బొమ్మ పూర్తయినట్టా
ఓయ్
అంతుపట్టని ఈ చిక్కు ప్రశ్నకు
నువ్వేమీ సమాధానం ఇవ్వక్కర్లేదులే
నాకేం ఇప్పుడప్పుడే ఆట పూర్తి చేయాలని లేదు.”
ఈమధ్య కాలంలో రమాదేవి రాసిన కవితలకు…ఈ కవిత భిన్నమైంది. ఇది కూడా ప్రేమ కవితే…
కానీ,రొటీన్ కు కాస్తంత భిన్నమైంది.
ప్రేమికులన్నాక ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ఒకరి లోపాలను మరొకరు సానుకూలంగా అర్ధం
చేసుకోవాలి.. సుఖాలనే కాదు.. కష్టాలను కూడా పంచుకోవాలి. అలా కాకుండా ఒకరి లోపాలను
ఇంకొకరు ఎత్తి చూపుకుంటూవుంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.స్త్రీ పురుషుల మధ్య… సంబంధం, వ్యవహారధోరణిలో అనుమానాలు, అపోహలు వుండకూడదు.మనకు నచ్చినవైతే... సరేసరి. లేకుంటే ఎత్తిచూపి కసురుకోవడం మంచిది కాదు..
ఈ విషయంలో స్త్రీలకంటే పురుషులే…ఒక్క అడుగు ముందుంటారు. స్త్రీలపై పురుషాధిక్యం, స్త్రీ, పురుషులమధ్య వివక్ష
ఈనాటిది కాదు. కొన్న వేల యేళ్ళుగా వున్నదే.. స్త్రీ ఎలా వుండాలి? కన్ను, ముక్కు, ఇంకా అంగాంగాలను పురుషుడే నిర్ణయిస్తాడు. మనిషిగా పుట్టే స్వేఛ్ఛకూడా స్త్రీకిలేదు.. ఆ స్వేఛ్ఛ ఇవ్వడానికి పురుషుడు ఇష్టపడడు. ఇది నేటికథకాదు.యుగాలనుండి నడుస్తున్న చరిత్రే.. ఇప్పుడు రమాదేవి కవీతలో..కెళదాం!
పురుషుడు స్త్రీ బొమ్మ గీయడం మొదలెడతాడు.
స్త్రీ ఆసక్తిగా చూస్తూ ఉంటుంది.ఇందులో ముక్కు బాగాలేదంటూ.. అందులో కన్ను బాగలేదంటూ
మొత్తం పది బొమ్మలు గీస్తాడు. ఇందులో తొమ్మిదినీ పక్కకు పెట్టి పదో బొమ్మతో పూర్తయిందంటాడు
పూర్తయిన పదో బొమ్మను ఎవరికో ఇచ్చి డబ్బు… చేసుకుంటాడు.. అంటే పదో బొమ్మను అమ్ముకుం
టాడన్నమాట...కొన్నవాడు కూడా పదో బొమ్మ అందంగా వుందనే కొంటాడు.మరి మిగిలిన తొమ్మిది
బొమ్మల సంగతి..?
అతగాడు అందంగా గీశాడనుకుంటున్న ఆ పదో బొమ్మ ఆమెకు నచ్చలేదు.దానిపై ఆమెకెప్పుడూ ఆశక్తి కలగనేలేదు..ఆమె కళ్ళెప్పుడూ అతగాడు అసంపూర్ణంగా వదిలేసిన ఆ 9 బొమ్మల పైనేవుంది.
ఇంతకూ ఆ వదిలేసిన బొమ్మలు పూర్తయినట్టా? బాగుందంటూ వదులుకున్న బొమ్మ పూర్తయినట్టా?
అన్నది ఆమె సందేహం.
అంతుపట్టని ఈ చిక్కు ప్రశ్నకు అతగాడేమీ సమాధానం ఇవ్వక్కర్లేకున్నా,ఆమెకు మాత్రం ఇప్పుడప్పుడే ఈ ఆటను పూర్తి చేయాలని లేదంటున్నారు ఈ కవయిత్రి ఆర్ రమాదేవి.
ఈ బొమ్మలాటకు తెర పడితేనే కదా! స్త్రీకి స్వేఛ్ఛ ఎన్నాళ్ళిలా పురుషుల చేతిలో బొమ్మలుగా,వాళ్ళ శాసనాల్లో అక్షరాలుగా మిగిలిపోతారు. రమాదేవి గారే చెప్పాలి..
పురుషుడెప్పుడూ Selective గానే వుంటాడు.. అందం, ఐశ్వర్యం వున్నచోటే మనువాడతాడు.
నిజానికి అందం కన్ను ముక్కు చెవి వంటి అవయవాల్లో వుంటుందా,? కంటికి కనిపించని ఆమె మనసులో వుంటుందా? ఇన్నేళ్ళు గడిచినా ఈ చిన్న లాజిక్ను పురుషప్రపంచం ఎలా మిస్సవుతోందో…అర్ధం కావడం లేదు.
నిజానికి అందం అతగాడు సొమ్ములు చేసుకునే… పదో బొమ్మలో లేదు. అసంపూర్తిగా వదిలేసిన..
ఆ తొమ్మిది చిత్రాల్లోనే అసలైన అందం వుందంటున్నారు రమాదేవి…!